కేసీఆర్ ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం

కేసీఆర్ ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం
  • వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వి.రావు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎం.వి.రావు వెల్లడించారు. యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయని.. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయని ఆయన చెప్పారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు. కేసీఆర్ కు ఎలాంటి ప్రమాదం లేదని.. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆయన చెప్పారు. ఉదయమే ఎడమ చేతి వైపు నొప్పిగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు..అందుకే పొద్దున ఇంటికి వెళ్లి  టెస్ట్ చేసాము.. ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కి రమ్మని చెప్పామన్నారు.

యాంజియో గ్రామీ చేసాము ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు, మళ్లీ మెడ,మెదడు రెండు టెస్ట్ లు చేసాము.. అన్నీ నార్మల్ గా ఉన్నాయన్నారు.
ఇవాళ ఉదయం 8 గంటలకు కేసీఆర్ కు టెస్ట్ చేసాము.. నెక్ దగ్గర కొంత పెయిన్ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు..  బీపీ, షుగర్ సీఎం కేసీఆర్ కి ఉన్నాయి.. షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పామన్నారు. టెస్టుల్లో కిడ్నీ, లివర్ బాగుందని రిపోర్టు వచ్చిందన్నారు. కేసీఆర్ కు రొటీన్ గా నెల నెలా టెస్టులు చేస్తుంటామని.. ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కు డే కేర్ అడ్మిషన్ మాత్రమే తీసుకున్నామని,  వారం రోజుల విశ్రాంతి అవసరం అన్నారు. వారం రోజులకు ఒక సారి షుగర్ టెస్ట్ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు చెప్పామని డాక్టర్ ఎం.వి.రావు వివరించారు.