వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతు

వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతు

యద్రాద్రి భువనగిరి జిల్లాలో వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతు అయ్యారు. రాజపేట మండలం కుదారం గ్రామం దోసల వాగులో ఈ ఘటన జరిగింది. మేనమామతో ఇద్దరు యువతులు.. బైక్ పై ఇటికలపల్లి వెళ్లి వస్తూ దోసల వాగు దాటే ప్రయత్నం చేశారు. అయితే వాగు దాటుతుండగా స్కూటీ మధ్యలో ఆగిపోయి వాగులో పడిపోయింది. దీంతో బైక్ పై ఉన్న హిమబిందు, సింధుజాలు నీటి ప్రవాహానికి గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. సింధుజాని ప్రవాహం నుండి బయటకు తీశారు. అయితే ఆమె పరిస్థితి ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మరో యువతి కోసం గాలింపు చర్యలు కొనగుతున్నాయి.

గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో  వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.