కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్​ : కిషన్​రెడ్డి 

కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్​ : కిషన్​రెడ్డి 

సికింద్రాబాద్​,వెలుగు: కేంద్రంలో మరోసారి  మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్నర్ మీటింగ్ లో భాగంగా బుధవారం రాంగోపాల్​పేట్ డివిజన్ లోని కాలనీలు, బస్తీల్లో ఆయన పర్యటిస్తూ మాట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అవినీతి జరిగేదని, ఇప్పుడా మాటే లేదన్నారు. రూ.720 కోట్ల నిధులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. బీజేపీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి, చీర శ్రీకాంత్, శ్యామ్ సుందర్ గౌడ్, కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, డివిజన్ ప్రెసిడెంట్ఆకుల ప్రతాప్,ఆనంద్ వ్యాస్ పాల్గొన్నారు.