నిరుద్యోగులకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఉద్యోగాలు పొందిన వారికి అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వాలన్నారు ఆదిత్యనాథ్. శుక్రవారం ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ ఉద్యోగ నియామకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వొద్దని పారదర్శకంగా పరీక్షలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగ నియామాకాలు పూర్తి చేయాలని తెలిపారు సీఎం. ఈ అంశంపై త్వరలో యూపీఎస్సీ నియామక సంస్థలతో ఆదిత్యనాథ్ సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు యూపీ ప్రభుత్వం లక్షా 37వేల పోలీస్ నియామకాలు, 50 వేల టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలలో లక్షకు పైగా నియామకాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.