పెళ్లికి ఆర్టీసీ బస్సులో 60 మంది.. సీజ్ చేసిన పోలీసులు

పెళ్లికి ఆర్టీసీ బస్సులో 60 మంది.. సీజ్ చేసిన పోలీసులు

లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లికి ఎక్కువ మందిని తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సును వికారాబాద్ జిల్లా పోలీసులు సీజ్ చేశారు. తాండూర్ మండలం గౌతాపూర్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా పరిగి డిపోకు చెందిన బస్సు వచ్చింది. అందులో 60 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు ప్రశ్నిస్తే తామంతా పెళ్లికి వెళ్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ లో పెళ్లి కూతురు తరపు వారికి 20 మందికి మాత్రమే పర్మిషన్ ఉందన్నారు పోలీసులు. రూల్స్ ఉల్లంఘించినందుకు పెళ్లి కూతురు తండ్రితో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేశామన్నారు కరణ్ కోట్ SI ఏడుకొండలు.