రాత్రి దోమలు చంపి తెల్లారి లెక్క అడిగితే ఎలా : మంత్రి వీకే సింగ్

రాత్రి దోమలు చంపి తెల్లారి లెక్క అడిగితే ఎలా : మంత్రి వీకే సింగ్

ఢిల్లీ : పాకిస్థాన్ లోని బాలాకోట్ లో వైమానిక దళాలు జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదులు ఎంతమంది అనేదానిపై ఇంకా రాజకీయ రగడ కొనసాగుతోంది. విపక్షాల ప్రశ్నలపై ట్విట్టర్ లో సెటైర్ వేశారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. “రాత్రి దోమలు కుడితే… హిట్ కొట్టి వాటిని చంపేస్తుంటాం. మరునాడు చనిపోయిన దోమల లెక్క ఎంత అంటే ఏం చెబుతాం. కూర్చుని లెక్కపడతారా. ఓసారి ఆలోచించండి” అని ట్వీట్ చేశారు. దీనిపై జాతీయ మీడియాకు ఆయన వివరణ ఇచ్చారు. వెయ్యి కిలోల బాంబులు వేసినప్పుడు.. భారీ పేలుడు జరిగినప్పుడు ఎంతమంది చనిపోయారనేది కౌంట్ చేయాలని కోరడం దురదృష్టకరం అని అన్నారు వీకే సింగ్.