దీదీ.. ఈ ఎన్నికల్లో మీ ఓటమి ఖాయం

దీదీ.. ఈ ఎన్నికల్లో మీ ఓటమి ఖాయం

కోల్‌‌కతా: బెంగాల్‌లో దీదీ కోట కూలడం ఖాయమని బీజేపీ నేత సువేందు అధికారి అన్నారు. నందిగ్రామ్ నుంచి తాను పోటీ చేస్తానని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు ఓటమి తప్పదని సువేందు చెప్పారు. దీదీ ఓటమి, నిష్క్రమణ ఖాయమని స్పష్టం చేశారు. ‘నందిగ్రామ్ నుంచి దీదీ పోటీ చేయబోతున్నారని క్యాండిడేట్ లిస్ట్ ప్రకారం తెలుస్తోంది. మంచిది, దీన్ని మేం స్వాగతిస్తున్నాం. కానీ మిడ్నాపూర్‌లో స్థానిక అభ్యర్థులే పోటీ చేయాలి కానీ బయటివాళ్లు కాదు. దీదీతో ఎన్నికల రణరంగంలోనే తేల్చుకుంటాం’ అని సువేందు తెలిపారు. గతేడాది ఆఖర్లో సువేందు తృణమూల్ నుంచి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. నందిగ్రామ్‌లోని పుర్బా మెడినీపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. టీఎంసీలో ఉన్నప్పుడు దీదీకి సువేందును ఆప్తుడిగా చెప్పుకునేవారు.