కాంగ్రెస్​లోచేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా

కాంగ్రెస్​లోచేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా
  • ఆహ్వానించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

హైదరాబాద్, వెలుగు: ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం లోటస్ పాండ్ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాకు ఇటీవల వైసీపీ టికెట్ దక్కలేదు.

చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరాజును వైసీపీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో నిరాశకు లోనైన ఎలీజా కాంగ్రెస్ లో చేరారు.చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.