లవ్ ఫెయిల్యూర్ తో యువకుడి సూసైడ్

లవ్ ఫెయిల్యూర్ తో యువకుడి సూసైడ్

శంషాబాద్, వెలుగు: లవ్ ఫెయిల్యూర్ తో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నార్సింగి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధిపేట మండలం కిస్మత్ పురా గ్రామానికి చెందిన మహేశ్ తేజ(24) ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఆదివారం హైదర్ షా కోట్ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ పక్కనున్న ఓ లాడ్జిలో మహేశ్ రూమ్ రెంట్ కి తీసుకున్నాడు. మద్యం తాగి రూమ్ లోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని నార్సింగి పోలీసులు తెలిపారు. మహేశ్ తేజ రెంట్ కి తీసుకున్న రూమ్ లో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రూమ్ లో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా లవ్ ఫెయిల్యూర్ తో మహేశ్ తేజ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు ఫైల్ చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు.