సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడి మృతి

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడి మృతి

సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. గుడిహత్నూర్‌ మండలానికి చెందిన పరమేశ్వర్‌ అనే యువకుడు సెల్‌ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ పరమేశ్వర్‌ మృతి చెందాడు.