Bengaluru Stampede: రూ.కోటి ఇస్తా నా కొడుకును ప్రాణాలతో తిరిగి తెస్తారా? పానీపూరీవాలా సీరియస్

Bengaluru Stampede: రూ.కోటి ఇస్తా నా కొడుకును ప్రాణాలతో తిరిగి తెస్తారా? పానీపూరీవాలా సీరియస్

బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో 14 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు. అయితే ఆ కుర్రోడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని.. అందుకే ఆంధ్రప్రదేశ్ నుంచి అతడిని చూసేందుకు బెంగళూరుకు వెళ్లాడని తెలిసింది. 

 బెంగళూరు స్టేడియం వద్ద తొక్కిసలాటలో తన 20 ఏళ్ల కుమారుడు మనోజ్ కుమార్ ప్రాణాలు కోల్పోవటంపై తండ్రి దేవరాజ్ స్పందించారు. వృత్తిరీత్యా ఆయన బెంగళూరు నగరంలో పానీపూరీ అమ్ముకుంటున్నారు. పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇంత ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయి వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించటం ఆయనను ఆగ్రహానికి గురిచేసింది. 

Also Read:-తొక్కిసలాట ఘటన.. చనిపోయిన ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు

దీంతో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తమకు అక్కర్లేదని, తాను రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్నానన్నారు. తనిచ్చే డబ్బు తీసుకుని తన కొడుకును మళ్లీ ప్రాణాలతో తీసుకురాగలరా అంటూ సీరియస్ అయ్యారు. వార్తల్లో తొక్కిసలాట గురించి చూసి తన కుమారుడికి కాల్ చేశానంటూ సదరు త్రండి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సమయంలో ఆ ఫోన్ వేరేవారు ఎత్తటంతో ఏదో తప్పుజరిగిందని గ్రహించానని అన్నారు. ఆ తర్వాత తనకు పోలీసులు కాల్ చేసి బోరింగ్ హాస్పిటల్ కి రావాలని చెప్పినట్లు వెల్లడించారు.

ఆ సమయంలో తన కుమారుడి బాడీని చూసేందుకు తనకు ధైర్యం సరిపోలేదని చెప్పారు. ఇద్దరి మిత్రులతో కలిసి వెళ్లిన తన కుమారుడు విగతజీవిగా మారటంతో షాక్ అయినట్లు చెప్పారు. తన కుమారుకు కేవలం విదాన్ సౌదాకు మాత్రమే వెళతానన్నారని, వారు చిన్నస్వామి స్టేడియం వద్దకు ఎప్పుడు వెళ్లాడో తెలియలేదని అన్నారు.