సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి 

 సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి 
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: మంత్రి ఈటల వ్యవహారం సీఎం కేసీఆర్ పరిధి లో ఉందని, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి చెప్పారు. శనివారం తెలంగాణా భవన్ లో మంత్రులు తలసాని,  మల్లారెడ్డి, బాల్క సుమన్ ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతా రాహిత్యంగా  మాట్లాడుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎపుడైనా ప్రభుత్వం నడిపిస్తే తెలుస్తది, గాలి  మాటలు కాదు ప్రాక్టికల్  గా చేసి చూపాలని సూచించారు. ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా జాగ్రత్తల కోసం ఎంత చేస్తుందో అడుగు ముందు.. బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం సరికాదు అని బండి సంజయ్ కు సూచించారు. కేవలం బీజేపీ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన బండి సంజయ్ ఏమన్నా సత్య  హరిశ్చంద్రుడా ? అని ప్రశ్నించారు. ఇతర ప్రశ్నలపై మంత్రులు సమాధానం దాటవేశారు.