మరో 2,043 గుడులకు..ధూప దీప నైవేద్యం స్కీమ్

మరో 2,043 గుడులకు..ధూప దీప నైవేద్యం స్కీమ్

హైదరాబాద్ , వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మరో 2,043 గుడులకు ధూప దీప నైవేద్యం స్కీమ్ వర్తింప చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్ శనివారం జీవో జారీ చేశారు. 32 జిల్లాల్లో స్కీమ్ వర్తించనున్న ఆలయాలను జీవోలో పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో 171, సంగారెడ్డిలో 140, నల్గొండలో 127, నిజామాబాద్ లో 120 దేవాలయాలున్నాయి. 

ఆదాయం లేని ఆలయాలకు ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల రూ.6వేల ఆర్థిక సహాయం చేస్తోంది. స్కీమ్ ను ఇతర దేవాలయాలకు కూడా వర్తింపచేస్తామని బ్రహ్మణ సదనం ప్రారంభసమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా కమిషనర్ జీవో జారీ చేశారు.