జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ మిగిలిన సెషన్స్ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించారు. కరోనా కారణంగా మెయిన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పరిస్థితి అనుకూలంగా కనిపిస్తుండడంతో ఇప్పుడు షెడ్యూల్ ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు 3,4 వ విడుతల జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 
గత ఏప్రిల్ లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ మూడవ విడుత ఈనెల  20 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. 4వ విడుత ఈనెల 27 నుండి ఆగష్టు 2వ తేదీ వరకు జరుగుతాయి. కరోనా కారణంగా గత ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన  పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీషెడ్యూల్ చేసి ప్రకటన విడుదల చేసింది.