రేపటి నుంచి రాష్ట్రంలో మెగా వాక్సినేషన్ 

రేపటి నుంచి రాష్ట్రంలో మెగా వాక్సినేషన్ 

గ్రామస్థాయిలోనూ 100శాతం వ్యాక్సిన్ వేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈనెల16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయడంపై  హనుమకొండ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, రాష్ట్ర,జిల్లా అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా  అధికారులతో కలిసి కేక్ కట్  చేశారు మంత్రి ఎర్రబెల్లి.