
వరంగల్ సిటీ, వెలుగు: కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. నాలుగు రోజుల కింద ఓ స్టూడెంట్ను ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగు చూడగా.. సోమవారం మరో వీడియో బయటకు వచ్చింది. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులను ట్యూటర్స్ ఇబ్బంది పెడుతున్నట్టు, ర్యాగింగ్కు పాల్పడుతూ స్టూడెంట్స్తో ఫ్లోర్ క్లీనింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది. ఎవరికైనా కంప్లైంట్ చేస్తే మార్కులు కట్ చేస్తామని బెదిరిస్తుంచినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు వీడియో వైరల్ అయ్యింది. ఐదు రోజుల్లోనే రెండు ర్యాగింగ్ ఘటనలు వెలగు చూడడంతో స్టూడెంట్స్ భయపడ్తున్నారు. ఫ్లోర్ క్లీన్ చేస్తున్న విద్యార్థినులను వీడియో తీసిన మరో స్టూడెంట్ తప్పుగా ప్రచారం చేసిందని, ర్యాగింగ్ లాంటిదేమీ జరగలేదని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.