బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మైసూర్ రోడ్డులోని ఓ సరస్సు తెగిపోవడంతో టోల్ బూత్ పూర్తిగా మునిగిపోయింది. భారీ వర్షాలతో కణ్మణికే సరస్సు పొంగిపొర్లుతోంది. దీంతో బెంగళూరు-మైసూర్ హైవే మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే పై టోల్ గేట్ పూర్తిగా మునిగిపోవడంతో పలువాహనాలు చిక్కుకున్నాయి. రామనగర్ లో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రామనగర్ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. బెంగళూరు-మైసూర్ హైవే పై రాకపోకలు నిలిపివేశారు.
Welcome to Ramanagar district. Rains have submerged the main Mysuru - Bengaluru Highway. pic.twitter.com/wSgwLUov10
— Suraj Suresh (@Suraj_Suresh16) August 29, 2022