రెండేళ్లలో తెలంగాణలో బీజేపీ సర్కార్

రెండేళ్లలో తెలంగాణలో బీజేపీ సర్కార్

రెండేళ్లలో తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆరె మైసమ్మ టెంపుల్ దగ్గర ఆయన మాట్లాడారు. కేసీఆర్ అబద్ధాల ముఖ్యమంత్రి అంటూ విమర్శించారు. ఏపీలో జగన్ ప్రజా సమస్యలపై రివ్యూలు చేస్తుంటే ఇక్కడ కేసీఆర్ మాత్రం ప్రజలను కలవడం లేదని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని మొదటగా SC నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నారు. గోషామహల్ కు 2 వేల కోట్ల నిధులు ఇస్తానంటే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. హుజురాబాద్ లో గెలిచేది డబ్బులు కాదు.. గెలిచేది ఈటల మాత్రమేనని స్పష్టం చేశారు. GHMC ఎన్నికల్లో TRS  ప్రభుత్వం ఇచ్చిన పది వేలు తీసుకుని బీజేపీకి ఓటు వేశారన్నారు. తెలంగాణను కేసీఆర్ మత్తుల తెలంగాణగా మార్చాడుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాతబస్తీలో బీజేపీ సభ నిర్వహిస్తే ఓవైసీ సోదరులు ఏం పీకారని ప్రశ్నించిన రాజాసింగ్.. MIM నేతలను పాకిస్థాన్ తరిమికొడతామన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం MIM కు అలవాటని విమర్శించారు.