కాటేదాన్ లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

కాటేదాన్ లో రూ.  1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

రంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. డ్రగ్స్ తరలిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా డ్రగ్స్ ను గుర్తించి సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ లోని బాబూల్ రెడ్డి నగర్ లో ఓ గోదాంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు.

 ఈ తనిఖీల్లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే నల్ల మందు గుర్తించారు. కాటేదాన్ అడ్డాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నిర్ధారించారు.  రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు నల్ల మందు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.  నల్ల మందును వివిధ బ్రాండ్స్ కు సంబంధించిన కవర్స్ లో ప్యాకింగ్ చేసి రాష్ట్రం అంతా సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.  ఈ తనిఖీల్లో ఇద్దరు అరెస్ట్ కాగా వారి వద్ద నుండి ఓ బోలెరో వాహనం, 10 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పై మరింత దర్యప్తు చేస్తామని అన్నారు.