
గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. గవర్నర్ స్పీచ్ అంటే నా సొంత ప్రసంగం కాదు కదా అన్నారామె. సెషన్ ప్రోరోగ్ కాలేదని తన ప్రసంగాన్ని రద్దు చేయడం ఏంటని ప్రవ్నించారు. గవర్నర్ ప్రసంగంతో సభ్యులకు చర్చించే అవకాశం దొరుకుతుందన్నారు. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు తమిళిసై. టెక్నికల్ రీజన్స్ చూపించి తన ప్రసంగాన్ని రద్దు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చే స్టేట్ మెంట్నే తాను చదివి వినిపిస్తానన్నారు. తన ప్రసంగం లేదని చెప్పినా సెషన్ను అనుమతించానని ఆమె తెలిపారు. ప్రజా సంక్షేమం ఆగొద్దనే బడ్జెట్ సెషన్ను అనుమతి ఇచ్చానని తమిళిసై పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: