24,25తేదీల్లో తెలంగాణ ఎడ్ సెట్ పరీక్ష

24,25తేదీల్లో తెలంగాణ ఎడ్ సెట్ పరీక్ష

హైదరాబాద్: తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షను ఈనెల 24, 25వ తేదీల్లో నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. రెండు విడుతలుగా పరీక్ష జరగుతుందని, తొలుత ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తర్వాత మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షకు 42వేల 339 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారి, వీరి కోసం తెలంగాణలో 45 పరీక్షా కేంద్రాలు, ఏపీ లో 4 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.