మళ్లీ కరోనా బారిన పడిన మాజీ కేంద్రమంత్రి 

మళ్లీ కరోనా బారిన పడిన మాజీ కేంద్రమంత్రి 

మాజీ కేంద్రమంత్రి,TMCనేత బాబుల్‌ సుప్రియో మూడోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో ట్వీట్ చేశారు. తన తండ్రి, భార్య, పలువురు సిబ్బందికి పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రి పదవి నుండి వైదొలగాలని పార్టీ ఆదేశించడంతో  గతేడాది జులైలో బీజేపీని  వీడి TMCలో చేరారు. కరోనా కోవిడ్‌ షాట్‌ అధిక ధరకు అమ్మడంపై  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 84 ఏళ్ల తండ్రి కోసం ఈ షాట్‌ను కోనుగోలు చేయాల్సివచ్చిందని, అణగారిన వర్గాల వారు ఎలా కొనుగోలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రియో 2020 నవంబర్‌లో మొదటిసారి కరోనా బారినపడ్డారు. అదే సమయంలో ఆయన తల్లి కూడా కరోనా చికిత్స పొందుతూ మరణించారు.  ఆ తర్వాత  గతేడాది ఏప్రిల్‌లో రెండోసారి కరోనా బారిన పడ్డారు బాబుల్ సుప్రియో.

మరిన్ని వార్తల కోసం...

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 102 మందికి కరోనా