సాయి పల్లవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

సాయి పల్లవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

హైదరాబాద్: హీరోయిన్ సాయి పల్లవి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆమె సినిమాలను అడ్డుకుంటామని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె.శివకుమార్ హచ్చరించారు. గో మాత, గో రక్షకులపై హీరోయిన్ సాయి పల్లవి చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. దేశ వ్యాప్తంగా పాపులర్ కావడానికి సాయి పల్లవి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గోరక్షకులను,  హిందువులకు పవిత్రమైన గోమాతను సాయి పల్లవి అవమానించిందన్నారు. ఒక్క గోవు బలికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి  హిందువుపై ఉందని, గో రక్షణ కోసం హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం అవగాహన లేకుండా ఆమె ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని, తక్షణమే హిందూ సమాజనానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోరక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అరెస్ట్ చేయలేదని, ఎంఐఎం నేత ఓవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా సాయి పల్లవి స్పందించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.