వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

న్యూ ఇయర్ రోజన జమ్మూకశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు చనిపోగా.. దాదాపు 13 మందికి గాయాలయ్యాయని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో దర్శనం క్యూలో కొందరి మధ్య వాగ్వాదం జరిగి అది తొక్కిసలాట దారి తీసిందని ప్రాథమిక సమాచారం అందుతోందని డీజీపీ చెప్పారు. తెల్లవారుజామున 2.45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.

మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.