ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం

ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐటీటీ మద్రాస్లో కరోనా కలకలం రేగింది. 19 మందికి కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా.. 12 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు స్టూడెంట్స్కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో స్వల్ప లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. 12 మందికి పాజిటివ్గా తేలింది. 

ఒమిక్రాన్ కొత్త వేరియెంట్ నేపథ్యంలో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులో బుధవారం 31 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్క ఐఐటీ మద్రాస్‌లోనే 12 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.