తెలంగాణలో కొత్తగా 146 కేసులు

తెలంగాణలో కొత్తగా 146 కేసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో 146 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. ఆదివారం 26 వేల మందికి టెస్టులు చేశామని చెప్పింది. ఇక ఎట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాల నుంచి వచ్చిన 791 మందికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెస్టులు చేశామని వెల్లడించింది. వారిలో ఒకరికి వైరస్ పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చిందని తెలిపింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి శాంపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించామని బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో నెగెటివ్ రిపోర్టు వచ్చిన 4,558 మంది క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారన్నారు. కాగా, ఇప్పటివరకు 17 శాంపిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపగా.. 13 మందికి ఒమిక్రాన్ వేరియంట్ లేదని తేలిందని చెప్పారు. మిగిలిన నలుగురి రిపోర్టులు రావలసి ఉందని అధికారులు తెలిపారు