తెలంగాణలో కొత్తగా(28న) 1764 కరోనా కేసులు నమోదవగా 12 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58906 కు చేరగా మరణాల సంఖ్య 492 కు చేరింది. నిన్న ఒక్కరోజే 842 మంది కోలుకున్నారు. మొత్తం 14663 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా 43751 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 28న 18858 మందికి కరోనా టెస్టులు చేయగా 1764 కేసులు నమోదయినట్లు హెల్త్ డిపార్ట్ మెంట్ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 28 వరకు మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 397939 కు చేరింది.
see more news
విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల కోసం ఫ్రీగా స్మార్ట్ఫోన్లు