తెలంగాణలో కొత్తగా 1,771 కేసులు 13 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1,771  కేసులు 13 మంది మృతి

హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు నమోదుకాగా..వైరస్ తో 13 మంది చనిపోయారని తెలిపింది వైద్యారోగ్యశాఖ. ప్రస్తుతం రాష్ట్రంలో 21,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2384 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5 లక్షల 76 వేల 487 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇవాళ 1,20,525 మందికి కరోనా పరీక్షలు చేశారని చెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 171 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది.