ఐఐటీ మద్రాస్లో మరో 18 మందికి కరోనా 

ఐఐటీ మద్రాస్లో మరో 18 మందికి కరోనా 

ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మంది కొవిడ్ పాజిటివ్గా తేలగా.. తాజాగా మరో 18 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో క్యాంపస్లో కరోనా బారినపడిన వారి సంఖ్య 30కు చేరింది. వారందరినీ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 

తమిళనాడులో గువరాలం కొత్తగా 39 కరోనా కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకొని ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,53,390కు చేరింది. కొవిడ్ 19 కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యం 18వేల టెస్టులు నిర్వహించగా.. ఆ సంఖ్యను 25వేలకు పెంచాలని చెప్పింది.