ఢిల్లీలో హై అలర్ట్.. 2000 బుల్లెట్లు స్వాధీనం

ఢిల్లీలో హై అలర్ట్..  2000 బుల్లెట్లు స్వాధీనం

పెద్దఎత్తున మందుగుండును సరఫరా చేస్తున్న ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2వేలకుపైగా లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని ఎక్కడికి తరలిస్తున్నారు ? ఎందుకు తరలిస్తున్నారు ? అనేది తెలియాల్సి ఉంది. ఆ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం మీదుగా రెండు బ్యాగ్ లలో బుల్లెట్లతో వెళ్తుండగా వారిని పోలీసులు  అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15 నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ఉంది. ఈనేపథ్యంలో దేశ రాజధాని నగరమంతా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలోనే తనిఖీలు నిర్వహిస్తుండగా బుల్లెట్లను తరలిస్తున్న వ్యక్తులు దొరికిపోయారు.