మత్తు పదారాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు

మత్తు పదారాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు

2.5 కోట్ల విలువైన మత్తు పదార్ధాలను సైబరాబాద్ పోలీసులు ధ్వంసం చేశారు. దుండిగల్ లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ లో 1338.05 కేజీల గంజాయి, 485ml హాష్ ఆయిల్, 11గ్రాముల కొకైన్ ను పోలీసులు ధ్వంసం చేశారు. గడిచిన రెండేళ్లలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేశారు. 5,406 కేజీల గంజాయి, 10.86 లీటర్ల హాష్ ఆయిల్, 141కేజీల ఆల్ప్రాజోన్, 206 గ్రాముల కొకైన్, 200గ్రా ఓపియమ్, 333MDMA స్వాధీనం చేసుకున్నారు.