లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

కృష్ణా జిల్లాలో ఇవాళ(సోమవారం) ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం బొమ్ములూరు దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకుపోయిన మృతులను క్రేన్ సాయంతో బయటకు తీశారు. గాయపడినవారిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భీమవరం లో పెళ్లికి వెళ్లి నూజివీడుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను చీమకుర్తి నాగేశ్వరవు,  తాతారావు, కనకదుర్గ గా గుర్తించారు పోలీసులు.