
‘బొమ్మరిల్లు’ తర్వాత అలాంటి ఫాదర్ సన్ ఎమోషన్ను ‘త్రీ బీహెచ్కే’ సినిమాలో చూస్తారని హీరో సిద్ధార్థ్ అన్నాడు. తను లీడ్గా నటించిన ఈ చిత్రానికి శ్రీగణేష్ దర్శకత్వం వహించాడు. మీథా రఘునాథ్, చైత్ర హీరోయిన్స్గా నటించగా, శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్పై అరుణ్ విశ్వ నిర్మించారు. జులై 4న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘ఓ మధ్య తరగతి కుటుంబం సొంత ఇంటి కలను ఎలా నెరవేర్చుకుంది అనే కాన్సెప్ట్తో, ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ చిత్రం ఉండబోతోంది. ప్రొడ్యూసర్ అరుణ్ ఇప్పుడు ఉంటున్న ఇంటిలో గతంలో కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఉండేవారు. అందుకే ఈ సినిమాని ఆయనకు అంకితం ఇస్తున్నాం’ అని చెప్పాడు.
ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది అని నటులు శరత్ కుమార్, దేవయాని అన్నారు. చాలా ప్రేమతో సినిమా తీశామని దర్శకుడు శ్రీ గణేష్ చెప్పాడు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోందని నిర్మాత అరుణ్ విశ్వ చెప్పాడు. మైత్రి శశిధర్ రెడ్డి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.