అస్సాంలో  భూప్రకంపనలు

అస్సాంలో  భూప్రకంపనలు

అస్సాంలోని గౌహతిలో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 1.12 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. కమ్రుప్‌ కేంద్రంగా తేజ్‌పూర్‌కు 156 కిలోమీటర్ల దూరంలో, భూమికి పదికిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది.

గౌహతితో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ప్రభావంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.