Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?

Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) పై నిర్మాతలు తిరుపతి బ్రదర్స్(Thirupathi Brothers) ఫిర్యాదు చేశారు. తిరుపతి బ్రదర్స్ అంటే దర్శకుడు లింగు స్వామి(Lingusami), ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్(Sibhash chandrabose) అని తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఉత్తమ విలన్(Uttama Villain) సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్ ఫిలిమ్స్ మీడియా సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నటుడు రమేష్ అరవింద్  తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా.. భారీ డిజాస్టర్ గా నిలిచింది.

దాంతో.. చిత్ర నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఆ నష్టాలను నుండి బయటపడటానికి తమతో రూ.30 కోట్లలో సినిమా చేస్తానని ఒప్పుకున్నాడట కమల్. కానీ, ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి కమల్ మాట్లాడటం లేదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని తిరుపతి బ్రదర్స్ తమిళ చిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో.. కమల్ హాసన్ పై  ఉన్న నమ్మకంతో ఉత్తమ విలన్ సినిమా చేశామని, ఆ సినిమా ప్లాప్ అయినా కారణంగా తమతో మరో సినిమా చేస్తనని కమల్ మాట ఇచ్చాడని, ఆ హామీని కమల్ నిలబెట్టుకోలేదని, దీంతో తప్పని పరిస్థితిలో ఆయనపై  ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని.. పేర్కొన్నారు లింగుస్వామి. మరి ఈ ఫిర్యాదుపై కమల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.