రైల్వే సిగ్నల్స్ లో సమస్య .. ఢీకొన్న రెండు రైళ్లు

రైల్వే సిగ్నల్స్ లో సమస్య .. ఢీకొన్న రెండు రైళ్లు

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఢీ కొని దాదాపు 53 మంది గాయపడ్డారు. వీరిలో 13మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గోందియా జిల్లాలో జరిగిన ఈ ఘటన అర్ధరాత్రి దాటాక 2.30గం. సమయంలో చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న భగత్ కి కోటి ఎక్స్‌ప్రెస్‌‌ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్ వెళ్తున్న ఈ రెండు రైళ్లు సిగ్నల్స్ లో తలెత్తిన సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భగత్ కి కోటి ఎక్స్‌ప్రెస్‌కి చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. 

అయితే గాయపడిన కొందరు క్షతగాత్రులను గోందియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ సిగ్నల్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.