రాష్ట్రంలో కొత్తగా 7 వేల 646 కేసులు..53 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 7 వేల 646 కేసులు..53 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 7 వేల 646 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారినపడి 53 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 2 వేల 261కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4 లక్షల 35 వేల 606 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 77 వేల 727 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. GHMC పరిధిలో నిన్న అత్యధికంగా 1441 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 631 పాజిటివ్ కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్ జిల్లాలో 330 కేసులు రికార్డయ్యాయి.