బుమ్రాకు మందలింపు

బుమ్రాకు మందలింపు

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన తొలి టెస్టులో నిబంధనలను అతిక్రమించిన ఇండియా స్టార్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రాను ఐసీసీ మందలించింది. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరుగు తీస్తుండగా.. బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడిని అడ్డుకున్నట్లు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిఫరీ తేల్చాడు.

దీన్ని ఐసీసీ లెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 తప్పిదంగా గుర్తించి బుమ్రాకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు అతనికి ఒక డీ మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించాడు. గత 24 నెలల్లో బుమ్రా చేసిన తొలి తప్పిదం కావడంతో  వార్నింగ్, డీమెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టాడు.