
రేషన్ బియ్యం తీసుకోవాలంటే మొబైల్కు వచ్చే ఓటీపీ తప్పనిసరి చేస్తూ తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో సగటు ప్రజలు ఆధార్కు మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవడం కోసం మీసేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కసారిగా ఉన్నట్టుండి మీసేవా సెంటర్ల ముందు భారీగా లైన్లు కట్టారు. నెంబర్ లింక్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మీసేవా సెంటర్ల మీద పడడంతో.. సర్వర్లన్నీ బిజీగా మారి మొరాయిస్తున్నాయి. అటు రేషన్ అందకపోవడం.. ఇటు ఫోన్ నెంబర్ ఆధార్తో లింక్ కాకపోవడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో… రేషన్ షాపుల్లోనే ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
For More News..