ప్రముఖ భరత నాట్యనృత్యకారిణి, తెలుగు సినీ నటి సుధా చంద్రన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి కేడీ చంద్రన్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ నెల 12న ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ(సోమవారం) గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
సుధా చంద్రన్ తండ్రి కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ‘హమ్ హై రహీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే సప్నే’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘కోయీ మిల్ గయా’ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు, 'గుల్మొహర్' టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు.
కేడీ చంద్రన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.