న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలను తయారు చేసే కంపెనీలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. కరెంట్ బండ్లలో వాహనాలు మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలపై ఆయన స్పందించారు. విద్యుత్ వాహనాల తయారీలో తప్పక నాణ్యత పాటించాలని లేకపోతే భారీ జరిమానాలు విధిస్తామన్నారు. దీంతోపాటు వాహనాలను రీకాల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Several mishaps involving Electric Two Wheelers have come to light in last two months. It is most unfortunate that some people have lost their lives and several have been injured in these incidents.
— Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022
గత రెండు నెలల్లో కరెంటు బండ్లలో పలు సమస్యలు రావడం, ప్రమాదాలు తలెత్తడం తన దృష్టికి వచ్చిందని గడ్కరీ తెలిపారు. ఈ ప్రమాదాల్లో కొందరు గాయాలపాలవ్వడం, మరికొందరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వాహనాల తయారీలో ఈవీ కంపెనీలు నాణ్యత పాటించాల్సిందేనన్నారు. వాహనదారుల భద్రతకు మోడీ సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు.
If any company is found negligent in their processes, a heavy penalty will be imposed and a recall of all defective vehicles will also be ordered.
— Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022
మరిన్ని వార్తల కోసం: