అహ్మదాబాద్ విమాన ప్రమాదం: సోదరుడి పాడె మోసిన రమేష్ విశ్వాస్..భావోద్వేగ వీడియో వైరల్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం: సోదరుడి పాడె మోసిన రమేష్ విశ్వాస్..భావోద్వేగ వీడియో వైరల్

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంత విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే..ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితోపాటు 54 మంది బీజే మెడికల్ కాలేజీ మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ బతికి బయటపడ్డాడు.. అయితే ఇదే ప్రమాదంలో రమేష్ విశ్వాస్ సోదరుడు అజయ్ రమేష్ కూడా ప్రాణాలో కోల్పోయారు. బుధవారం(జూన్18) డయ్యూలో అజయ్ అంత్యక్రియల్లో పాడే మోస్తూ రమేష్ విశ్వాస్ పాడే మోస్తూ విలపిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

బుధవారం జరిగిన అజయ్ విశ్వాస్ అంత్యక్రియాల్లో విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ పాల్గొన్నాడు. ఈ ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు అజయ్ విశ్వాస్.. ఈ వీడియోలు రమేష్ ఇంకా కాలిన గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు..అయినా అతని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సోదరుడు అంతిమయాత్రలో పాల్గొన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సోదరుడి పాడె మోస్తూ రోదిస్తూ కనిపించారు రమేష్ విశ్వాస్. 

విమాన ప్రమాద మృతులకు అంత్యక్రియలు.. 

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి డీఎన్ ఏ టెస్ట్ ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు అధికారులు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 190 మంది ప్రమాద బాధితులను గుర్తించారు. 159 మృతదేహాలను ఇప్పటికే కుటుంబాలకు అప్పగించామని అధికారులు బుధవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం పూర్తి రాష్ట్ర గౌరవాలతో మహారాష్ట్రలో జరిగాయి. 

మంగళవారం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, సీనియర్ సిబ్బంది అపర్ణ మహాదిక్, మైథిలి పాటిల్ లకు వారి స్వస్థలాలైన ముంబై, రాయ్ గఢ్, గోరేగావ్ లలో అంత్యక్రియలు జరిగాయి. ఈ ప్రమాదంలో నే ప్రాణాలు కోల్పోయిన అజయ్ విశ్వాస్ అంత్యక్రియలు గోవాలో అజయ్ విశ్వాస్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. సోదరుడి అంత్యక్రియల్లో కాలిన గాయాలతోనే రమేష్ విశ్వాస్ పాల్గొన్న హృదయ విదారక దృశ్యాలు అందరిని కలిచివేశాయి.