AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్.. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌‌‌‌లో స్ట్రీమింగ్

AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్.. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌‌‌‌లో స్ట్రీమింగ్

హర్ష రోషన్, భాను, జయతీర్థ లీడ్ రోల్స్‌‌‌‌లో సందీప్ రాజ్‌‌‌‌ షో రన్నర్‌‌‌‌గా జోసెఫ్ క్లింటన్ తెరకెక్కించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి ఈటీవీ విన్‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  హీరోలు శివాజీ, సుహాస్ ముఖ్య అతిధులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.    శివాజీ మాట్లాడుతూ ‘కేవలం ర్యాంక్స్ కోసం పిల్లలను చదవమనడం ఒక రకమైన హింస. అలాంటి తల్లిదండ్రులకి ఈ సిరీస్ ఒక గుణపాఠం అవుతుంది’ అని చెప్పారు.

షో రన్నర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ ‘యూనివర్సల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో వస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు ప్రతి సీన్‌‌‌‌, డైలాగ్‌‌‌‌కు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌తో కలిసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  ట్రైలర్‌‌‌‌‌‌‌‌ తరహాలోనే సిరీస్ కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని దర్శకుడు జోసెఫ్‌‌‌‌ చెప్పాడు.  కామెడీ, ఎమోషన్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్‌‌‌‌తో అందరికీ నచ్చేలా ఉంటుంది అని నటుడు హర్ష రోషన్ చెప్పాడు. నటి చాందిని, ఈటీవీ ప్రతినిధులు సాయికృష్ణ, నితిన్ తదితరులు పాల్గొన్నారు.