కరోనా భయంతో సీరియస్ కండిషన్లో ఉన్నా ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో 19 ఏళ్ల వధువు పెళ్లికి కొద్ది నిమిషాల ముందు ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కనౌజ్ జిల్లాలోని భగవత్పురాలో జరిగింది. శుక్రవారం రాత్రి భగవత్పురాకు చెందిన వినిత (19) వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ముహుర్తం నిశ్చయించారు. సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు పెళ్లికొడుకు సంజయ్, కుటుంబసభ్యులతో కలిసి కొన్ని గంటల ముందే అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. ఇళ్లంతా పెళ్లి సంబరంలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి పెళ్లి కూతురు ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటీన వినితను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమెకు కరోనా ఉందేమోనన్న భయంతో ఆస్పత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. కరోనా నెగటివ్ రిపోర్టు ఉంటేనే హాస్పిటల్లో చేర్చుకుంటామని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆమెను తీసుకుని కాన్పూర్ ప్రయాణమయ్యారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలింది. దీంతో జరిగిన విషయాన్ని కనౌజ్ పోలీసులకు తెలిపారు వినిత కుటుంబసభ్యులు. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం శనివారం ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎంతో సంబరంగా కూతురి పెళ్లి చేద్దామనుకున్న వినీత తల్లిదండ్రులు.. గుండెలవిసిపోయే విషాదంతో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉందని కనౌజ్ పోలీసులు తెలిపారు. అవసరమైతే ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కరోనా భయంతో ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నో.. పెళ్లికి ముందు ప్రాణాలు వదిలిన 19 ఏళ్ల వధువు
- క్రైమ్
- June 29, 2020
లేటెస్ట్
- సిరిసిల్లలో కేటీఆర్ను ప్రశ్నించిన మహిళ రైతు
- ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
- ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
- మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఆరాటం
- దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్
- Barbie Telugu OTT: ఆస్కార్ గెలిచిన సూపర్ హిట్ మూవీ OTTకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్
- 8,9 తేదీల్లో రేవంత్రెడ్డిని అరెస్ట్ చేస్తరేమో?: సీపీఐ నారాయణ
- కెనడాలో ముగ్గురు భారతీయులు అరెస్ట్
- బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ: ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు