కశ్మీర్ అంశంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. 370 ఆర్టికల్ ను రద్దు చేయడానికి ప్రతిపాదించారు. దీంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి.. రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. బిల్లు పాస్ అయితే 370 ఆర్టికల్ రద్దు కానుంది. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోనుంది.
అమిత్ షా మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్ ను లడక్, జమ్ము కశ్మీర్ లు గా విభజించనున్నట్టు తెలిపారు. వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలు చేయనున్నామని…. అయితే జమ్ము కశ్మీర్ కు అసెంబ్లీ ఉంటదని, లడక్ లో అసెంబ్లీ ఉందడని ప్రతిపాదించారు అమిత్ షా. మరో గంటలో లోక్ సభలో మాట్లాడనున్నారు అమిత్ షా.