ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను ప్రదర్శించి, అమ్రిత కల్చరల్ ట్రస్ట్ కళాకారులు అలరించారు. శనివారం మాదాపూర్లోని శిల్పకళావేదికలో నాట్యతోరణం పేరిట నిర్వహించిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. సాయంత్రం పద్మకల్యాణ్ నేతృత్వంలో జరిగిన శంభు కంకిణి నృత్యోత్సవం కనులవిందుగా సాగింది.

