ఈ అవ్వతాతలను అడగండి. దాని విలువేందో చెప్తరు

ఈ అవ్వతాతలను అడగండి. దాని విలువేందో చెప్తరు

న్యూఢిల్లీ: 75 ఏండ్ల స్వాతంత్ర్య సంబురాలు దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జెండా ఎగరాలన్న ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. చిన్న పిల్లల నుంచి మొదలు యువత, వృద్ధుల వరకు తమ తమ ఇండ్లపై మువ్వన్నెల జెండాలు ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. అయితే, ఇండిపెండెన్స్ రోజున ఈ గోలేంటి అనేవాళ్లకు సమాధానం చేప్పేలా ఉన్న ఫొటోను ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్​లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఓ పెద్దావిడ ఇనుప డ్రమ్​పై ఎక్కి తన ఇంటిపై జెండా కట్టింది.

ఆమె పడిపోకుండా ఉండేందుకు పెద్దాయన డ్రమ్ పట్టుకున్నాడు. అలా కష్టపడుతూ అయినా తమ ఇంటిపై ఆ అవ్వతాతలు జెండా ఎగురవేశారు. దీనికి సంబంధించిన ఫొటోనే ఆనంద్ మహీంద్రా షేర్  చేశారు. ‘‘స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంత గొడవెందుకనేవాళ్లు ఒక్కసారి ఈ అవ్వతాతలను అడగండి. దాని విలువేందో చెప్తరు. జైహింద్” అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటోఎక్కడిదో మాత్రం తెలియలేదు కానీ, ఇప్పటివరకు 1.40 లక్షల దాకా లైక్​లు వచ్చాయి. 13 వేల మందికి పైగా ఈ ఫొటోను రీట్వీట్ చేశారు.