కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ ఏఎన్ఎంలు

కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ ఏఎన్ఎంలు

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడంతో హెల్త్ డిపార్ట్ మెంట్ మరింత అప్రమత్తమైంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు డోర్ టు డోర్ వెళ్లి ట్రావెల్ హిస్టరీ ఉన్నవాళ్ల డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవేర్ నెస్ కల్పించడంతోపాటు హోం క్వారంటైన్లో ఉన్న వారిని ఇళ్లు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు . కరోనా లక్షణాలుంటే వెంటనే వారిని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీల ప్రెసిడెంట్లసాయంతో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు .

ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లే కీలకం

హైదరాబాద్ జిల్లా పరిధిలోని 14 క్లస్టర్ల లో 85పీహెచ్సీలు, 5 యూపీహెచ్సీలు ఉన్నాయి. 320 మంది ఏన్ఎంలు, 600 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు గ్రేటర్ లో 140 దాటడం, రాష్ట్రంలో 11 మంది మృతి చెందగా.. ఏడుగురు సిటీకి చెందిన వాళ్లుండటంతో వారంతా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు . పాజిటివ్ వ్యక్తుల డేటా చేతికి అందిన మరుక్షణమే ఆ వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశాడన్న విషయాలు తెలుసుకుంటున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్న వాళ్లకు టెస్టులు చేయించి, ఇండ్లకు క్వారంటైన్ స్టిక్కర్లు అంటిస్తున్నారు.