ఖమ్మం, వెలుగు: యుద్ధం కారణంగా చాలా చోట్ల గ్యాస్ కొరత ఏర్పడింది. హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు లభించక కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో మాత్రం ఇలాంటి సమస్యల్లేవు. ఆ ఊర్లో 300 ఇండ్లలో పైప్ లైన్ నేచులర్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఉండడంతో నేరుగా ఇండ్లకే గ్యాస్ సరఫరా అవుతోంది.
సంబంధిత గ్యాస్ కంపెనీకి డిపాజిట్ డబ్బులు చెల్లించి, ప్రీ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్న తర్వాత పైప్లైన్ కనెక్షన్ ఇస్తారు. దానికే మీటర్ కనెక్ట్ చేయడంతో ఎంత గ్యాస్ వాడుకున్నామనే వివరాలు వస్తాయి. డొమెస్టిక్ గ్యాస్ కేజీ రూ.62 వరకు పడుతుండగా, ఈ పీఎన్జీ మాత్రం రూ.51కే కిలో వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
