భారతదేశంలో అతిపెద్ద సంతానోత్పత్తి చికిత్స గొలుసుకట్టు సంస్ధ.. తెలంగాణాలో తమ 5వ సాంకేతికాధారిత కేంద్రాన్ని కరీంనగర్ లో ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా భారతదేశంలో సంస్థ కేంద్రాల సంఖ్య 96కు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ లో సంస్థ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 1000 కు పైగా జంటలకు మాతృత్వపు కలలను సాకారం చేసింది.
కరీంనగర్లో కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు డాక్టర్ క్షితిజ్ ముర్దియా, సీఈవో అండ్ కో–ఫౌండర్, ఇందిరా ఐవీఎఫ్. సంతానం కోసం పరితపించే జంటలకు ఆపన్న హస్తం అందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. సాంకేతికత పరంగా ఇందిర ఐవీఎఫ్ అభివృద్ధి చేసిన విప్లవాత్మతక ఆవిష్కరణలతో ఎన్నోజంటలు మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చాయని తెలిపారు.